గాజాలో వ్యవసాయ భూమిలో కేవలం 5 శాతానికి తక్కువ భూమి మాత్రమే వ్యవసాయానికి ఉపయోగపడుతోందని ఐక్యరాజ్యసమితి అంచనా వెల్లడించింది. ఇది ఆ ప్రాంతంలో కరువు ముప్పును మరింత పెంచుతోందని Reuters నివేదిక తెలిపింది.
“ఈ స్థాయి విధ్వంసం కేవలం మౌలిక సదుపాయాల నష్టమే కాదు — ఇది గజాలో వ్యవసాయ-ఆహార వ్యవస్థ యొక్క పతనం మరియు జీవనాధారాల విఘాతం,” అని Food and Agriculture Organisation (FAO) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ Beth Bechdol అన్నారు. ఈ అంచనాను FAO, UN Satilite Center తో కలిసి రూపొందించింది.
ఇజ్రాయెల్ బాంబుల దాడులు ప్రారంభమైన 19 నెలలకి ముందు, గజాలోని రైతులు నారింజ పండ్లు, ఖర్జూరాలు, ఆలివ్ పంటలు వంటి అనేక పంటలు సాగు చేస్తూ వచ్చారు — అయితే ఇది ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో ఒకటిగా ఉంది.
ప్రస్తుతం, 11 వారాల Blockade అనంతరం ఇజ్రాయెల్ ఆహార దిగుమతులపై ఆంక్షలు విధించడంతో, అర మిలియన్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని Globle Hunger Monitor తెలిపింది.
UN అంచనా ప్రకారం, మొత్తం భూమిలో కేవలం 688 హెక్టార్లు లేదా 4.6 శాతం మాత్రమే సాగుకు అందుబాటులో ఉన్నాయి.
గజాలోని వ్యవసాయ భూముల్లో 80 శాతానికి పైగా యుద్ధం వల్ల దెబ్బతిన్నాయని ఇది చూపించింది. మొత్తం 77.8 శాతం భూములు, ఇజ్రాయేల్ విధించిన పరిమితులు, ఖాళీ చేయాలనే ఆదేశాల కారణంగా, అందుబాటులో లేవని తెలిపింది.
ఉన్నతమైన శాటిలైట్ చిత్రాలను ఆధారంగా చేసుకుని తయారైన ఈ అంచనాలో, గ్రీన్హౌస్లలో మూడు పాళ్లలో రెండు (సుమారు 75 శాతం), బావులలో 80 శాతం పైగా నాశనం అయినట్లు గుర్తించారు.
ఈ పరిస్థితి రఫా ప్రాంతంలోని నైరుతి భాగంలో, ఉత్తర గాజాలో “అత్యంత తీవ్రంగా” ఉందని పేర్కొంది, అక్కడ క్రాప్ల్యాండ్ దాదాపు పూర్తిగా అందుబాటులో లేదని తెలిపింది.