Close Menu
BTJ
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
Facebook X (Twitter) Instagram WhatsApp Telegram
Trending:-
  • ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ
  • ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు
  • షఫాలీ మృతికి కారణమేమిటి?
  • గోల్కొండ కోటలో బోనాల సందడి
  • ఆర్‌సీబీ ప్లేయర్‌ యష్‌ దయాల్‌పై కేసు
BTJBTJ
Monday, June 30
  • Home
  • UK News
    • Political
    • Crime
      • UK Crime Files
    • Cinema
    • Culture
    • Sports
  • AP/TS News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • World News
    • Political
    • Crime
    • Cinema
    • Culture
    • Sports
  • వెన్నెల
    • Kidsoochi
    • Health & Fitness
  • Business
  • History & Context
  • Thinking Aloud
    • Radical Thinkers
  • అవీ ఇవీ
  • Movie Reviews
    • Local
    • Global
  • Book Reviews
    • Contemporary Reading
    • Popular Literature
  • Click book
BTJ
Home»AP/TS News

ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎందుకు వార్తల్లో ఉంది?

April 21, 2025No Comments3 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఈ ఏడాది జనవరిలో దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లయబిలిటీ కంపెనీతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా సదరు కంపెనీ తెలంగాణలో 100 మెగావాట్‌ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు రూ. 5,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది.

అయితే ఇంతవరకు ఆ కంపెనీ కార్యకలాపాలను ప్రారంభించనేలేదు. కేవలం ఒప్పందానికి మూడునెలల ముందు గత సెప్టెంబర్‌ 27న ఆ సంస్థ యూఎస్‌లో రిజిస్టరైంది. ఇవన్నీ సంస్థపై అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. యుఎస్‌లో కంపెనీ రిజిస్టర్‌ అయిన అడ్రస్‌లో కంపెనీకి సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లూ లేవని, కనీసం ఫోన్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ అడ్రస్‌ కూడా లేవనే ఆరోపణలున్నాయి.

రిజిస్ట్రేషన్‌ వేళ సమర్పించిన వివరాల ఆధారంగా చూస్తే.. ‘సింగిల్‌ట్రీ సిటీ ప్లెసాంటన్‌, సీఎఫ్‌-94588-యూఎస్‌ఏ’ అడ్రస్‌లో ఓ 1,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ ట్రిపుల్‌ బెడ్‌రూం ఇల్లు మాత్రమే ఉన్నది. అక్కడ కనీసం పదిమంది ఉద్యోగులు కూడా లేరనే విమర్శలున్నాయి. అంతేకాదు, ఉర్సా ఎల్‌ఎల్‌సీ అండ్‌ ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థలుగా ఉన్నాయని, ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ ఈ మధ్యనే ఏప్రిల్‌ మొదటి వారంలో జరిగిన బోర్డు సమావేశంలో ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిలిటీ కంపెనీ షేర్లు బదలాయించినట్లు రికార్డులు చెప్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 10 వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన ఈ రెండు కంపెనీలకు కనీసం ఒక ఫోన్‌ నంబర్‌ కానీ, ఈ-మెయిల్‌ ఐడీ కానీ లేవు. దీంతోపాటు ఈ రెండు కంపెనీలు ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలూ లేవు. ఇన్నివేల కోట్లు పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కనీసం సరైన ఆఫీస్‌ కూడా లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అయితే సంస్థ వివరాలేవీ చూడకుండా ప్రభుత్వాలు ఒప్పందానికి వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నది.

ప్రభుత్వం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నట్టు ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. అక్కడున్న తెలుగువారితోనే ఒప్పందాలు చేసుకుంటుండటం గమనార్హం. కేంద్ర కంపెనీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌ వివరాల ప్రకారం ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంగా సరిగ్గా రెండు నెలలక్రితం 2025 ఫిబ్రవరి 12న ప్రారంభమైంది. రూ.10 కోట్ల ఆథరైజ్డ్‌ క్యాపిటల్‌తో ఇద్దరు డైరెక్టర్లతో ఈ కంపెనీ రిజిస్టర్‌ చేశారు. ఇందులో డైరెక్టర్లుగా కౌశిక్‌ పెందుర్తి, సతీశ్‌ అబ్బూరి ఉన్నారు.

కౌశిక్‌ పెందుర్తి ప్రస్తుతం ‘టాలస్‌ పే’ అనే కంపెనీలో సీపీటీవోగా విధులు నిర్వహిస్తుట్టు ఆయన లింక్డిన్‌ అకౌంట్‌ తెలియజేస్తున్నది. అంటే కౌశిక్‌ అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఓ స్థాయిలో పనిచేస్తున్న ప్రైవేటు ఉద్యోగి అని తెలుస్తున్నది. ఇక సతీశ్‌ అబ్బూరి ‘ఎల్సీయం అనలిటిక్స్‌’కు వ్యవస్థాపకుడు, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతోపాటు యూఎస్‌లో రిజిస్టర్‌ అయిన ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిలిటీ కంపెనీలోనూ ఈ ఇద్దరే డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఉర్సా క్లస్టర్స్‌ లిమిటెడ్‌ లయబిటీ కంపెనీని కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత, అంటే 2024 సెప్టెంబర్‌ 27న రిజిస్టర్‌ చేశారు. ఈ కంపెనీకి అనుబంధ సంస్థగా చెప్పుకొంటూ ఇండియా ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను 2025 ఫిబ్రవరి 19న రిజిస్టర్‌ చేశారు. ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అడ్రస్‌గా ‘ఫ్లాట్‌ నంబర్‌-705, ఏక్తా బాసిల్‌ హైట్స్‌, కొత్తగూడ, హైదరాబాద్‌’ చిరునామాతో ఒక రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ను చూపించారు. కాగా, అకడ కూడా ఎటువంటి కార్యాలయం లేకపోగా.. ఈ మూడు బెడ్రూమ్‌ల ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివాసం ఉంటుండటం గమనార్హం. కేవలం 2 నెలల వయసున్న, కనీసం ఒక ఆఫీస్‌, ఫోన్‌నంబర్‌, వెబ్‌సైట్‌ కూడా లేని కంపెనీతో ఇటు తెలంగాణ, అటు ఏపీ రాష్ర్టాలు వేల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు చేసుకోవడం, ఏపీ ప్రభుత్వం రూ.వందల కోట్ల విలువ చేసే భూములను కంపెనీకి కేటాయించడం సందేహాలకు తావిస్తున్నది.

రూ.10 కోట్ల క్యాపిటల్‌ ఇన్వెస్టిమెంట్‌తో మొదలైన కంపెనీ రెండు తెలుగు ప్రభుత్వాలతో వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎలా ఒప్పందం కుదుర్చుకోగలిగిందన్నది అందరినీ విస్మయపరుస్తున్నది. దీనివెనుక ఎవరున్నారనేది ఆసక్తిగా మారింది. ఒప్పందాలు జరగడానికి కొద్దిరోజుల క్రితమే కంపెనీలు రిజిస్టర్‌ కావడం, అందులో డైరెక్టర్లుగా ఉన్న ఇద్దరూ తెలుగువారే కావడం, రెండు తెలుగు రాష్ర్టాలతో ఒప్పందాలు చేసుకోవడం పలు సందేహాలకు తావిస్తున్నది.

అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్‌ దావోస్‌లో పెట్టుబడుల కోసం పోటాపోటీగా ప్రయత్నించినట్టు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు ప్రచారం చేసుకున్నాయి. ఆ సందర్భంగా ప్రకటించిన పెట్టుబడుల్లో నిజాయితీ ఎంతని విపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ వచ్చాయి. షెల్‌ కంపెనీలతో పెట్టుబడుల దోబూచులాట జరుగుతున్నదన్న అనుమానాలనూ అవి వ్యక్తంచేశాయి. ఈ నేపథ్యంలో రూ.5,728 కోట్ల ప్రాజెక్టు విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈనెల 10న జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డ్‌ సమావేశంలో 17 సంస్థలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, ఆయా పరిశ్రమల స్థాపనకు వివిధ జిల్లాల్లో భూముల కేటాయింపునకు చంద్రబాబు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి 59 ఎకరాల భూమిని కేటాయించింది. మారెట్‌ ధర ప్రకారం ఆ భూమి విలువ రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇటు తెలంగాణ ప్రభుత్వంతో రూ.5,000 కోట్ల ఒప్పందం చేసుకున్న కంపెనీతోనే ఏపీ సైతం ఒప్పందం చేసుకోవడం గమనార్హం.

Author

  • britishtelugujournal
    britishtelugujournal

    View all posts
Add to Bookmark Bookmark
AP Government Data Centers India Foreign Investment Government MoU Investment Fraud Kaushik Pendurthi Satish Abburi Shell Company Telangana Government Ursa Clusters
Previous Articleఅమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధి ఎన్నికల వ్యవస్థ మీద ఆరోపణలు
Next Article తూర్పు గోదావరి జిల్లాలోని మల్లాం గ్రామంలో దళితుల సాంఘిక బహిష్కరణ
Add A Comment
Leave A Reply Cancel Reply

Top Posts

హంతక తండ్రి -హబ్సీగూడలో దారుణం

March 12, 2025

అప్రమత్తతతో చూడాల్సిన సినిమా “కోర్ట్”!

March 17, 2025

“పోటీ ఒత్తిడికి బలైన తండ్రి – కన్నబిడ్డల హత్యతో ముగిసిన విషాద కథ!”

March 18, 2025

అడవిలో కురిసిన రంగుల వాన: కాళ్ళ సత్యనారాయణ

February 5, 2025
Don't Miss

ట్రకోమా రహిత దేశంగా భారత్: మోదీ

india news June 30, 2025

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2025 జూన్ 29న తన ‘మన్ కీ బాత్’ 123వ ఎపిసోడ్‌లో ప్రపంచ ఆరోగ్య…

Add to Bookmark Bookmark

ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

June 30, 2025

షఫాలీ మృతికి కారణమేమిటి?

June 30, 2025

గోల్కొండ కోటలో బోనాల సందడి

June 30, 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Instagram
  • YouTube
Facebook X (Twitter) WhatsApp Instagram

News

  • World
  • US Politics
  • EU Politics
  • Business
  • Opinions
  • Connections
  • Science

Company

  • Information
  • Advertising
  • Classified Ads
  • Contact Info
  • Do Not Sell Data
  • GDPR Policy
  • Media Kits

Services

  • Subscriptions
  • Customer Support
  • Bulk Packages
  • Newsletters
  • Sponsored News
  • Work With Us

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

© 2025 British Telugu Journal.
  • Privacy Policy
  • Terms

Type above and press Enter to search. Press Esc to cancel.