భారత్, పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు JD Vance స్పందించారు. యుద్ధం మధ్యలో తాము కలుగజేసుకోమని స్పష్టం చేశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదని అన్నారు. యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలమన్నారు. మధ్యలో కలుగజేసుకుని యుద్ధం ఆపమనడం తమ పని కాదన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఇండియన్స్ను యుద్ధం ఆపమని అమెరికా చెప్పలేదు.
అలాగే పాకిస్తానీలను యుద్ధం ఆపమని కూడా చెప్పలేదు. ఈ యుద్ధం తీవ్రతరమై మరింత పెద్ద యుద్ధంగా.. న్యూక్లియర్ వార్గా మారకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి రాదని మేము అనుకుంటున్నాము’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు Donald Trump కూడా భారత్, పాక్ యుద్ధంపై స్పందించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అన్నారు. భారత్, పాకిస్తాన్ గురించి నాకు బాగా తెలుసునని, ఆ రెండు దేశాలు సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు.