Americaలో ఎక్కువ కాలం నివసిస్తున్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని Department of Homeland Security (DHS) హెచ్చరికలు జారీచేసింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్నవారు తప్పనిసరిగా Federal Government వద్ద రిజిస్టర్ చేసుకోవాలని, ఆ నిబంధన ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుము, జైలు శిక్ష విధిస్తామని DHS స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. అందుకే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపొమ్మని ఆదేశాలు జారీచేసింది. America లో నేర చరిత్ర లేనివారు తాము సంపాదించిన సొమ్ముని తీసుకెళ్లిపోవచ్చని, ఒకవేళ అలాంటివారికి విమాన టికెట్ల ఖర్చుకి ఇబ్బంది అయితే తాము రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది.
పై నిబంధనలు పాటించని వారిని దేశం నుండి పంపేస్తామని, ఫైనల్ ఆర్డర్ అందుకున్న తరువాత ప్రతి ఒక్కరోజు ఆలస్యానికి 988 డాలర్ల ఫైన్, స్వంతగా వెళ్లకపోతే 1000 నుందు 5000 డాలర్ల ఫైన్ విధించనున్నామని తెలిపారు. వారికి జైలు శిక్ష విధించే అవకాశంతో పాటు భవిష్యత్తులో అమెరికాలోకి ప్రవేశం సాధ్యం కాకపోవచ్చు. ఈ హెచ్చరికలను టెలివిజన్, రేడియో, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా DHS విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో, DHS 145 దేశాలకు చెందిన సుమారు 1.6 లక్షల అక్రమ వలసదారులను 495 అంతర్జాతీయ విమానాల ద్వారా వారి స్వదేశాలకు పంపింది. ఇందులో భారత్కు చెందినవారు కూడా ఉన్నారు. ఈ చర్యలు భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టబడ్డాయి. ఇలాంటి చర్యల ద్వారా అమెరికా అక్రమ వలసలను తగ్గించడానికి కృషి చేస్తోంది. అక్రమంగా నివసిస్తున్నవారు తమ స్వదేశాలకు స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తోంది.