UPI వాడేవారికి కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి. వాడుకలో లేని మొబైల్ నంబర్లకు ఏప్రిల్ 1 నుండి UPI సేవలు ఆగిపోతాయి. అంటే ఇనాక్టివ్ లేదా వేరే వారికి కేటాయించిన నంబర్లు ఈ కేటగిరిలోకి వస్తాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) బ్యాంకులు, పేమెంట్ సేవలు అందించే సంస్థలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. మోసాలను అరికట్టడానికి ఈ నంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. ఇదే సమయంలో UPI లైట్ వాలెట్లో లోడ్ చేసిన డబ్బును మళ్లీ బ్యాంకు అకౌంట్కు పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుండి అందుబాటులోకి వస్తుంది.
TDS, TCS నిబంధనలు:
TDS, TCS నిబంధనల్లో కూడా మార్పులు రానున్నాయి. సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారికి) బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వార్షిక వడ్డీ రూ.50,000 దాటితే, గతంలో TDS వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని రూ.1 లక్షకు పెంచారు. సాధారణ ప్రజలకు ఈ పరిమితి రూ.40,000 నుండి రూ.50,000 వరకు పెరిగింది.
విదేశాలకు డబ్బు పంపేవారికి కూడా ఒక వెసులుబాటు కల్పించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7 లక్షలు దాటితే TCS వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు. విద్యార్థుల చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఫీజు కోసం విదేశాలకు పంపితే, TCS ఉండదు.