తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని మంచిరేవులలో “Young India Police School” ప్రారంభించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలోతెలిపారు. పోలీసుల వృత్తి ధర్మం, విధుల స్వభావం వల్ల కుటుంబ విషయాలు, పిల్లల చదువు వంటి విషయాల మీద దృష్టి పెట్టలేనందున ఈ స్కూల్ లో 50% సీట్లు పోలీస్ అమరవీరులు, హోం గార్డ్స్ నుండి ఐపిఎస్ ఆఫీసర్ల పిల్లల వరకు రిజర్వ్ చేయబడి వుంటాయని, యాభై శాతం సీట్లు సివిలియన్స్ కి వుంటాయని, ఫీ స్ట్రక్చర్ తల్లిదండ్రులకు ఎంతో అనువుగా వుంటుందని ఆయన అన్నారు. స్కూల్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో CBSE Core Curriculum తో నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. విద్యార్థి యొక్క సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేలా అకడమిక్స్, స్పోర్ట్స్, కో కరిక్యులర్ యాక్టివిటీస్ వుంటాయని సివి ఆనంద్ తెలిపారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి ఇదొక గొప్ప అవకాశమని, వెంటనే అప్లై చేయాలని ఆయన ఆ వీడియోలో తెలిపారు.
Add A Comment