శుక్రవారం విజయవాడలో ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమైంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని బీజేపీ శాసనసభా పక్షం అభిప్రాయపడింది. సంకీర్ణంలో ఉన్నాం కాబట్టి సమస్యలను జాగ్రత్తగా డీల్చే యాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ ఫిర్యాదులు వస్తున్నాయని నేతలు తెలిపారు.
దేవస్థానం కమిటీలల్లో జరిగే నియామకాల్లో బీజేపీ నేతలను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. కూటమి కాబట్టి ఈ విషయాన్నీ చర్చించి దేవస్థానం కమిటీల్లో బీజేపీ నేతలను నియమించాలని కోరాలి అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కాబట్టి విమర్శలుగా కాకుండా సలహాలు రూపంలో ఉండాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. దేవస్థానం పాలక వర్గాల్లో బీజేపీ కార్యకర్తలకు స్థానం కల్పించాలంటూ ఎంఎల్ఏలు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దుగ్గుబాటి పురందేశ్వరికి విజ్జప్తి చేశారు.
ఈ సమావేశానికి ఎంపీ సీఎం రమేష్, మంత్రి సత్యకుమార్, బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు, నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, సుజనా చౌదరి, పార్థసారథి, ఎన్ ఈశ్వర రావుతదితరులు హాజరయ్యారు.