హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ రంగాన్ని విధ్వంసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ రంగాన్ని విధ్వంసం చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 500 మంది బీజేపీ, కాంగ్రెస్ నుంచి శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైడ్రా, మూసీ పేరుతో పేద ఇండ్లను కూల్చి వాళ్లను అవస్థల పాలు చేశారని మండిపడ్డారు. హైడ్రాను తనకోసమే తీసుకొచ్చినట్లుగా జన్వాడలో తనకున్న భూమిపైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్ను పడిందన్నారు. తన ఇంటిని కూల్చేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేశారని ఆరోపించారు.
రూ.లక్షా యాభై వేల కోట్ల మూసీ ప్రాజెక్టుతో ఢిల్లీకి డబ్బుల సంచులు పంపి తన కుర్చీని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూసీ సుందరీకరణతో ఎవరికి లాభం కలుగతుందని ప్రశ్నించారు. దాని వల్ల ఎంత మంది రైతులు బాగుపడతారు? దానితో సృష్టించే సంపద ఎంత? మూసీతో పారే ఎకరాలెన్ని? దాని వల్ల ఎవరికి లాభం కలగుతుందని నిలదీశారు. కేసీఆర్ ప్రభుత్వంలో శంకరపల్లి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని ఉపాధి పొందారన్నారు. శంకరపల్లి పరిధిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రియల్ భూముల ధరలు గణనీయంగా పడిపోయాయన్నారు. దీంతో ఎంతోమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.