ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున హైదరాబాద్ రవీంద్రభారతిలో విశ్వాసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో CMతో పాటు డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు పాల్గొన్నారు. అనంతరం భద్రాద్రి అర్చకులు శ్రీరామనవమి సందర్భంగా CM హాజరు కావాలని కోరుతూ కళ్యాణ పత్రికను అందచేశారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్ CT ప్రాజెక్ట్ను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్ అభివృద్ధికి కొత్త దిశనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఫ్యూచర్ CT ప్రాజెక్ట్ ప్రధానంగా సుస్థిర ఆవాసాలు, అధునాతన సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, మెరుగైన కనెక్టివిటీ వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంటుందని CM రేవంత్ రెడ్డి తెలిపారు.
ఈ ప్రాజెక్ట్కు సంబంధించి పరిశ్రమలు, IT హబ్, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, వైద్య సదుపాయాలు వంటి విభాగాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా, ఫ్యూచర్ CT దేశంలోని ఇతర నగరాలకు కూడా మార్గదర్శకంగా నిలుస్తుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.