ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్లో జరిగిన వివాహ వేడుకలో ‘జూతా చుపాయి’ (చెప్పులు దాచిపెట్టడం) అనే సంప్రదాయం వివాదానికి దారి తీసింది. ఈ సంప్రదాయం ప్రకారం, పెళ్లి తంతులో పెళ్లి కుమారుడి చెప్పులను పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాచిపెట్టి, వాటిని తిరిగి పొందడానికి డబ్బు కోరుతారు. ఇదొక సరదా ప్రక్రియ నిజానికి.
ఉత్తరాఖండ్ లోని చక్రతాకు చెందిన వరుడు మహమ్మద్ షబ్బీర్ కు ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ సందర్భంలో పెళ్లి కుమార్తె సోదరి పెళ్లి కుమారుడి చెప్పులను దాచిపెట్టి, వాటిని తిరిగి ఇవ్వడానికి రూ. 50,000 డిమాండ్ చేసింది. అయితే, పెళ్లి కుమారుడు మహమ్మద్ షబీర్ రూ. 5,000 మాత్రమే ఇచ్చాడు. దీనిపై పెళ్లి కుమార్తె కుటుంబంలోని కొన్ని మహిళలు అతనిని ‘బిచ్చగాడు ‘ అని నిందించారు. దానితో మగ పెళ్లివారు “మీరు పెట్టిన బంగారం నాణ్యత ఎంత” అంటూ నిలదీశారు. దీంతో రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం ప్రారంభమైంది, చివరకు పెళ్లి కుమారుడిని ఓ గదిలో బంధించి కర్రలతో దాడి చేశారు. రెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కంప్లెయింట్ ఇచ్చుకున్నారు. ఇరు వర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిర్చమ్రని పోలీసులు వెల్లడించారు.
ఈ సంఘటన పెళ్లి వేడుకల్లో సంప్రదాయాల పేరుతో డబ్బు డిమాండ్ చేసే విధానంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.