Friday, 7 August 2026

మరో కులోన్మాద “పరువు” దారుణం!

సూర్యపేటలో మరో కుల ఆధారిత పరువు హత్య జరిగింది. వడ్లకొండ కృష్ణ అనే దళిత యువకుడు భార్గవి అనే బిసి కులానికి చెందిన యువతిని తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నందుకు ఆమె కుటుంబ సభ్యులే అతన్ని ఈ నెల 26న దారుణంగా హతమార్చారు.

ఇది సుపారీ హత్య కాదు. భార్గవి కుటుంబ సభ్యులే తమ స్నేహితులతో కలిసి కృష్ణని చంపేశారు. ఈ హత్యలో భార్గవి అన్నలతో పాటుగా ఆమె నానమ్మ, నాన్న కూడా పాల్గొనటం విస్తుగొలిపే అంశం. ఒక కుటుంబంలోని మూడు తరాలు కలిసి చేసిన దారుణ నేరమిది. మొదటి తరానికి హత్య చేయడానికి కూడా వెరవనివ్వని కులోన్మాదం పోలేదు. రెండో తరానికి తామూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో బాధితులమేనన్న జ్ఞానం లేకపోగా తమ కంటే ఒక మెట్టు కిందనున్నవాడి పట్ల తన పైనున్న వాడు తన పట్ల ఎంత కర్కశంగా ఉంటాడో అంతే కర్కశంగా ఉండకూడదన్న ఇంగితం లేదు. ఇంక మూడో తరానికి సమాజానికి అవసరమైన నాగరిక విలువలు, చట్టాల పట్ల, రాజ్యాంగం పట్ల గౌరవం, మానవ సంబంధాలలో ప్రజాస్వామిక సంస్కారాలు వంటపట్టలేదు.

మన సమాజం శ్లాఘించే దుర్మార్గ విలువల్లో కులం చాలా ముఖ్యమైనది. ఏ మనిషైనా ఒకే రకంగా పుడతారు. ఒకే రకమైన శారీరిక వ్యవస్థతో బతుకుతారు. కానీ కొన్ని కులాల్లో పుట్టిన శరీరాలు గొప్పవై పోతాయి. దోపిడీ నిరంతరాయంగా అమలవ్వాలంటే తిరుగుబాటు గురించిన ఊహ కూడా భయపెట్టాలి. ఈ హత్య అనే కాదు కులాంతర, మతాంతర వివాహాల సందర్భంగా జరిగే ప్రతి హత్య వెనుక కేవలం పరువే కాదు, అంతకంటే మిన్నగా జెండర్ కోణం వుంటుంది. స్త్రీ ఒక మనిషిగా కాక కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తిగత ఆస్తిలా భావించబడే లైంగిక వివక్ష వుంటుంది. ఆమె ప్రేమించినవాడో లేదా పెళ్లాడినవాడో తమ ఆస్తిని తన్నుకుపోతున్నవాడిలా కనబడతాడు. అందుకే ఇలాంటి కేసుల్లో ఆమె ప్రేమించిన, పెళ్లాడినవాడే హత్య చేయబడతాడు. నిచ్చెనమెట్లల్లో అట్టడుగున వుండేది దళితులే కనుక వారే హత్యకి గురవుతుంటారు. ఇది వాస్తవం. కనుకనే కులం ప్రమాదకరం, ప్రాణాంతకమనే స్పృహ అట్టడుగున ఉన్న బాధితులకే ఎక్కువ వుండాలి. వారే ఎక్కువ అప్రమత్తంగా వుండాలి. మంథని మధుకర్, మిర్యాలగుడ ప్రణయ్, సూర్యాపేట కృష్ణ… ముగ్గురి జీవితాలే ఇందుకు ఉదాహరణ. అలాగని వారు నిచ్చెనమెట్లలో పైనున్న కులాల యువతులను వివాహం చేసుకోవద్దని కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ పై కులాల్లో ఉన్న ఉన్మాదులను నమ్మకూడదు.

హంతకులు దాష్టీక కులాలకి చెందినవారు కాకపోవడంతో “కుల/మత ఆధారిత సేనలు/వాహినులు” హంతకులకు మద్దతుగా లేవు. రిజర్వేషన్ల మీద దాడులూ లేవు.

పోలీసులు ఇవాళ ఆరుగురు హంతకుల్ని అరెస్ట్ చేశారు. హత్య జరిగినప్పటి నుండి తన కుటుంబ సభ్యులే కృష్ణని చంపారని భార్గవి మొత్తుకుంటూనే వున్నది. ఆమె అంటున్నదే నిజమైంది. ప్రణయ్ హత్యానంతరం అమృత ఎంత స్థిరంగా, నిర్భయంగా ఉన్నదో కృష్ణ హత్యానంతరం భార్గవి కూడా అంతే స్థిరంగా, నిర్భయంగా ఉన్నది. ఇద్దరూ కూడా తమ పుట్టిళ్లతో కాకుండా కడుపుకోతని ఎదుర్కొంటున్న తమ భర్తల కుటుంబాలతోనే కలిసి ఉంటామని ప్రకటించారు. ఇద్దరూ బలహీనతలకు లోనుకాకుండా పోరాట దృక్పథాన్ని ప్రదర్శించారు. ఇది వారి నిజాయితీని సూచిస్తున్నది. ఈ తరం ప్రదర్శించే ప్రత్యామ్నాయ ప్రగతిశీలతకి వారిద్దరూ ఉదాహరణలు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు