Saturday, 8 August 2026

వరి పంట… కన్నీటి పంట అయింది!

వర్షం కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ మహిళారైతు కన్నీటి కారణం!

వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఓ మహిళా రైతు — నెలల తరబడి కష్టపడి పండించిన ధాన్యం, సకాలంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసి ముద్ద అయింది. ఆమె ధాన్యాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్గరగా రోదించింది.

ప్రతి రైతుకీ ఇదే భయం!
సకాలంలో పంట కొనుగోలు చేస్తే ఉంటే… ఈ ఆర్తనాదం ఉండేదా?

తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులను ఆర్ధికంగా కుదిపేశాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో చోటు చేసుకున్న ఓ విషాద ఘటన ప్రజలను కలచివేసింది.

వాస్తవ ఘటన: కన్నీరు మున్నీరైన మహిళారైతు

ప్రభుత్వం సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో, రైతులు తమ ధాన్యాన్ని మైళ్లకు మైళ్లు తలపెట్టిన కొనుగోలు కేంద్రాల వద్ద నిలిపి ఉంచారు. అయితే అకాల వర్షానికి తడిసి ముద్దవడంతో ధాన్యము పాడైంది. ఈ దృశ్యాన్ని చూసిన నర్సంపేట మండలానికి చెందిన ఓ మహిళా రైతు తాను నెలల తరబడి కష్టపడి పండించిన పంట ఇలా కంటికి కనిపించేలా నాశనం కావడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించింది.

ఈ సంఘటన ప్రతీ రైతు మనస్సును కలిచివేస్తోంది. మట్టిలో పండిన ఆహారాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉండగా, సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల ఈ నష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల ఆవేదన
పంట కోత తరువాత కొనుగోలు కేంద్రాలు సిద్ధంగా లేకపోవడం

వర్షం రాక ముందు ధాన్యాన్ని తరలించే తగిన ఏర్పాట్లు లేకపోవడం

తడిసిన ధాన్యం తీసుకోవడానికి Telangana Markfed తిరస్కరణ

ప్రజల స్పందన
ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున స్పందన వ్యక్తమవుతోంది.
“రైతు కష్టాల్ని గౌరవించని పాలకులకి ఈ కన్నీళ్లు శాపంలా మారుతాయి” అని పలువురు అంటున్నారు.

ప్రభుత్వం స్పందించాల్సిన సమయం
ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే:

తక్షణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

తడిసిన ధాన్యానికి ప్రత్యేక షెడ్యూల్

రైతులకు సరైన నిల్వ సదుపాయాలు

పంటల బీమా అమలు

ఈ బాధను చూసిన తరువాత, “వరి రైతు కన్నీటి గొంతుక”ను పాలకులు వినాలని, వ్యవస్థ మారాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు