Friday, 7 August 2026

విశాఖపట్టణం లో మెడిసిన్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్య

విశాఖ జిల్లా భీమిలి మండలం తగరపువలస పరిధిలోని సంగివలస ఎన్నారై వైద్య కళాశాల విద్యార్థి ప్రణీత్ శిరం (24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాను చదువుతున్న కళాశాల భవనం నాల్గవ అంతస్తు మీద నుంచి కిందకి దూకి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.

విజయవాడకి చెందిన రాజేశ్వరరావు ఏకైక కుమారుడైన ప్రణీత్ 2019లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ లో చేరాడు. కరోనా సమయంలో తలెత్తిన ఇబ్బందుల కారణంగా చదువులో కొద్దిగా వెనుకబడి కొన్ని సబ్జెక్టులు తప్పుతూ వచ్చాడు. ఇప్పటికే ఇతడి బ్యాచ్ మేట్లు చదువు పూర్తిచేసుకున్నారు. Backlogs ఉండడంతో ప్రణీత్ ప్రస్తుతం MMBS final year part 2 చదువుతున్నాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్నాడు. శనివారం జరిగిన గైనిక్-1 పరీక్షకు స్లిప్పులు తెచ్చి చూసి రాస్తుండడంతో విధుల్లో ఉన్న ఇన్విజిలేటరు పట్టుకుని ఓఎంఆర్ షీటు తీసుకున్నారు. చీఫ్ ఎగ్జామినర్ గా వ్యవహరిస్తున్న శ్రీధర్రెడ్డికి, పరిశీలకులకు అప్పగించారు.

ఉదయం పది గంటలకు పరీక్ష ప్రారంభం కాగా, ఓ గంటసేపటిలోనే ఈ ఘటన జరిగింది. ప్రణీత్ ఎంత ప్రాధేయపడినా పరీక్ష రాసేందుకు వారు ఒప్పుకోకపోవడంతో పాటు పరీక్ష అయ్యే దాకా బయటికి పంపలేదు. దీంతో పరీక్ష హాలు పరిసరాల్లోనే అటూ ఇటూ తిరుగుతూ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఉన్నాడు. పరీక్ష రాసి విద్యార్థులు బయటికి వస్తున్న సమయంలో ప్రణీత్ ఒక్కసారిగా ఎమర్జెన్సీ ద్వారం వైపు పరుగు తీయడంతో అక్కడే ఉన్న వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్రెడ్డి కేకలు వేయడంతో విధుల్లో ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు ఆపేందుకు చేయిని పట్టుకున్నా కూడా బలవంతంగా విదిలించుకుని భవనం నాల్గో అంతస్తుపై నుంచి కింద దూకి అక్కడికక్కడే ప్రాణాలను వదిలాడు. తమ సహచరుడు మృతి చెందడంతో తోటి విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు