పెట్టుబడి స్కీముల పేరిట 200 మంది బాధితుల నుంచి రూ.14 కోట్లు వసూలు చేసి, రిటర్న్స్ ఇవ్వకుండా మోసం చేసిన వెలివిజల్రూస్ఆఫ్ కంపెనీ చైర్మన్ కందుల శ్రీనివాసరావును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఏపీలోని వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన శ్రీనివాస్ రావు(44) హైదరాబాద్ లోని గోకుల్ ప్లాట్స్ వెంకట రమణ కాలనీలో వెలివిజన్ గ్రూప్ ఆఫ్ పేరిటకంపెనీ ఏర్పాటు చేసి, దానికి చైర్మన్ గా ఉన్నాడు. ఇతని భార్య డైరెక్టర్ గా కొనసాగుతుంది. తన కంపెనీలో ఉన్న వివిధ స్కీముల్లో పెట్టుబడి చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇస్తానని సోషల్ మీడియా, ఇతర సామాజిన మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు.
స్కీమ్-1లో.. ఒక వ్యక్తి లక్ష డిపాజిటే చేస్తే 100 రోజుల పాటు రోజుకి రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ప్రకటించాడు. స్కీమ్-2లో.. లక్ష డిపాజిట్ చేస్తే నెలకు రూ.20 వేల చొప్పున పది నెలల పాటు చెల్లిస్తామని, స్కీమ్-3లో రూ.6.50 లక్షలు డిపాజిట్ చేస్తే నగర శివారులో 121 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్చేస్తామని, ఆ తర్వాత 20 నెలల పాటు నెలకు రూ.32,500 ఇస్తామని ప్రకటించారు.
దీని కోసం ఎంఓయూతో పాటు చెక్కులు కూడా చెల్లిస్తామని తెలిపారు. స్కీమ్-4లో వెస్ విజన్ హోం అప్లయన్సెస్ లో టీవీ, వాషింగ్మి షన్, ఏసీ వంటి వస్తువులు కొనుగోలు చేస్తే వస్తువు ధరను ప్రతి నెల తిరిగి చెల్లిస్తామని ప్రకటించారు. ఇలా ప్రతి స్కీమ్ లో రూ.10 వేల నుంచి రూ.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చని తెలిపారు. అయితే, ఈ స్కీమ్ గురించి తెలుసుకున్న రాజేంద్రనగర్ అత్తాపూర్ కు చెందిన ఝాన్సీ స్కీమ్ -1,2లలో పెట్టుబడులు పెట్టింది. అయితే, నెలలు గడిచినా రిటర్న్స్ రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు శ్రీనివాస్ రావును మంగళవారం అరెస్ట్చే శారు. నిందితుడు వివిధ స్కీమ్ల పేరుతో 200 మంది నుంచి రూ. 14 కోట్లు వసూల్ చేసినట్లు గుర్తించారు.


