Friday, 7 August 2026

ఇజ్రాయెల్‌ను విడిచిన 8,300 మంది High-Tech ఉద్యోగులు

2023 అక్టోబర్‌లో గాజాపై ఇజ్రాయెల్ ప్రారంభించిన విధ్వంసకర యుద్ధం తరువాత, సాంకేతిక రంగంలో పనిచేస్తున్న సుమారు 8,300 మంది ఉద్యోగులు ఇజ్రాయెల్‌ను విడిచివేసినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి.

బుధవారం విడుదలైన Israel Innovation Authority నివేదిక ప్రకారం, 2023 అక్టోబర్ నుండి 2024 జూలై వరకు ఈ ఉద్యోగులు దేశం విడిచిపోయారు. ఇది ఇజ్రాయెల్ టెక్ రంగంలో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 2.1 శాతంను సూచిస్తోంది.

అలాగే, ఈ నివేదిక ప్రకారం, 2024లో సుమారు 5,000 మంది ఉద్యోగులు టెక్ రంగం నుంచి నిష్క్రమించారు, ఇది కనీసం గత పదేళ్లలో తొలిసారి గణనీయమైన పడివేతగా పేర్కొనబడింది.

2024లో ఇజ్రాయెల్‌లో ఉన్న High-Tech ఉద్యోగుల సంఖ్య 390,847కి పడిపోయిందని, ఇది 2023తో పోలిస్తే 1.2 శాతం తగ్గుదల అని గణాంకాలు తెలియజేశాయి. అంటే 5,000 మంది ఉద్యోగులు సాంకేతిక రంగాన్ని విడిచిన విషయం ధృవీకరించబడింది.

ఇజ్రాయెల్‌లో ఉన్న హైటెక్ కంపెనీలలో విశ్వవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య దేశంలోని ఉద్యోగుల కంటే ఎక్కువగా ఉంది – నివేదిక ప్రకారం, 400,000 మంది ఇజ్రాయెల్‌లో ఉండగా, 440,000 మంది ఉద్యోగులు విదేశాల్లో ఉన్నారు.

Israel Innovation Authority CEO Dror Bin మాట్లాడుతూ, “హైటెక్ రంగం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన growth engine. ఈ రంగంపై లక్ష్యంగా పెట్టిన పెట్టుబడులు కొనసాగాలి” అని తెలిపారు.

అలాగే, విదేశాలకు వెళ్లిన టెక్ ఉద్యోగులు తిరిగి ఇజ్రాయెల్‌కు రావడానికి అవసరమైన రాజకీయ చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు.

ఇంతకుముందు ఇజ్రాయెల్ మీడియాలో వచ్చిన నివేదికల ప్రకారం, ఇజ్రాయెల్ గాజా యుద్ధం తర్వాత ఆర్ధిక పరిస్థితులు, భద్రతపై ప్రభావం కారణంగా చాలా మంది ఇజ్రాయెలీయులు దేశం విడిచినట్లు తెలుస్తోంది.

ఇవి తప్పక చదవండి

గ్రీన్‌ల్యాండ్ సంక్షోభంలో చిక్కుకున్న స్టార్మర్; అమెరికా సైనిక చర్య ప్రతిపాదనతో దౌత్య ఉద్రిక్తత; యూకే ప్రధాని ముందు కొత్త సవాళ్లు

లండన్: గ్రీన్‌ల్యాండ్‌ను ఎలాగైనా తన వశం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల ఇప్పుడు ప్రపంచాన్ని యుద్ధం అంచున నిలబెట్టింది. డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇచ్చేయాలని, లేదంటే సైనిక...

ప్రిన్స్ ఆండ్రూపై మళ్ళీ పోలీస్ నిఘా: ఎప్స్టీన్ కేసులో రహస్య సమాచార లీక్ ఆరోపణలు; రాజకుటుంబంలో మొదలైన కొత్త కలకలం

లండన్: బ్రిటన్ రాజకుటుంబం మరోసారి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో వెలుగులోకి వచ్చిన కొత్త అంశాలు మాజీ ప్రిన్స్ ఆండ్రూ (ప్రస్తుతం ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్) చుట్టూ ఉచ్చు బిగిస్తున్నాయి. 2026...

ఆర్కిటిక్ రీజియన్‌లో యూకే సైనిక బలగం రెట్టింపు; రష్యా ముప్పును ఎదుర్కొనేలా 2,000 మంది సైనికుల మోహరింపు; నాటో రక్షణ వ్యూహంలో కీలక మార్పులు.

నార్వే, ఫిబ్రవరి 11, 2026:ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా నుండి పెరుగుతున్న ముప్పును అడ్డుకునేందుకు బ్రిటన్ నడుం బిగించింది. మంచు గడ్డకట్టే ఉత్తర ధ్రువ ప్రాంతంలో తన సైనిక ఉనికిని భారీగా పెంచుతున్నట్లు యూకే...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు