మయన్మార్ తో పాటు థాయిలాండ్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాలకు అంతులేని శోకాన్ని, నష్టాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని థాయిలాండ్ కి చెందిన జియోలొజిస్ట్ జెస్ ఫీనిక్స్ అన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు నెలల తరబడి వచ్చే అవకాశం వున్నదని ఆమె అన్నారు.
కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తి పరిస్థితుల్ని బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. Earth Surface కి 10Km లోతులో ప్రకంపన కేంద్రాలు వున్నాయని United States Geological Survey తెలిపింది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య పది వేలు దాటే అవకాశం వుందని ఆ సంస్థ వెల్లడించింది. అయితే మయన్మార్ సైనిక ప్రభుత్వం మాత్రం 1,600 మందికి పైగా మాత్రమే విపత్తు కారణంగా మరణించినట్లు ప్రకటించింది. కాగా దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం విపత్తు కలగచేసే నష్టం మరింత తీవ్రతరం కావచ్చు.
ఈ కష్ట సమయంలో మయన్మార్ ప్రజలను ఆదుకునేందుకు భారత్ “అపరేషన్ బ్రహ్మ” పేరుతో 15 టన్నుల సహాయ సామాగ్రిని అక్కడికి పంపింది. ఇందులో ఆహార పదార్ధాలతో పాటు తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బాగ్స్, వాటర్ ప్యూరిఫైర్లు, సోలార్ లాంప్స్, జనరేటర్లు, అత్యవసర వైద్యపరికరాలు వున్నాయి. ఆ దేశంలో విపత్తు నిర్వహణ కోసం 80 మంది NDRF సిబ్బందిని అక్కడికి పంపనున్నది. ఇండోనేషియా, చైనా, అమెరికా దేశాలతో పాటు UNO కూడా సహాయక సామాగ్రిని పంపనున్నట్లు ప్రకటించాయి.


